
అయితే దీనిని కూడా కేంద్రం ఖండించి, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని తెలిపింది. మరి నేడు ఆ ప్రకటన రానే వచ్చింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 20, 50 రూపాయల కొత్త నోట్లను ముద్రిస్తున్నామని చేసిన ప్రకటన ప్రజల్లో ఎలాంటి స్పందన లేదు. దీనికి రెండు కారణాలు… ఇప్పటికే ఈ సమాచారం లీక్ కావడంతో మానసికంగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. మరొకటి… ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, పాత వాటిని కొనసాగిస్తూనే కొత్త నోట్లను అందుబాటులోకి తెస్తామని చెప్పింది. అయితే ప్రస్తుతానికి పాత నోట్లను ఉంచినా, భవిష్యత్తులో వీటిపై ప్రకటన రానుందన్న సంకేతాలు అయితే స్పష్టం.
ఇక మిగిలింది ఒక్క 100 రూపాయల నోటే. ఈ వంద రూపాయల నోటు ఏం పాపం చేసిందో గానీ, దీనిపై మాత్రం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే త్వరలో 100 రూపాయల నోటు కూడా సరికొత్తది రాబోతుందన్న విషయం ఇప్పటికే లీక్ కావడంతో… మరికొన్నాళ్ళ తర్వాతైనా ఆర్బీఐ నుండో, కేంద్రం నుండి వందపై కూడా ప్రకటన వస్తుందని సమాచారం. అయితే, ఈ చిన్న నోట్ల ముద్రణ వెనుకల కూడా పెద్ద స్కెచ్ ఉందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం ముద్రణ జరుగుతున్న 500 రూపాయలను ఆపివేసి మరీ ఈ చిన్న నోట్లను ముద్రించాల్సిన ఆవశ్యకత ఏం వచ్చిందో ప్రజలకు అర్ధం కాని పరిస్థితి. దేశంలో చిల్లర కొరతకు కారణం 2000 రూపాయల నోటు అన్నది స్పష్టం. అలాంటి 2 వేలకు చిల్లర కావాలంటే 500 రూపాయల నోటే ప్రత్యామ్నాయం. మరి వాటిని ఆపి, ఇంకా చిన్న నోట్లను ముద్రించడం అంటే… దేశంలోని కరెన్సీని ఇంకా తగ్గించడమే కదా… అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. తద్వారా ప్రజలకు నగదును అందుబాటులో లేకుండా చేసి ‘క్యాష్ లెస్’ లావాదేవీలను ప్రోత్సహించాలన్నది కేంద్రం అభిప్రాయంగా తెలియవస్తోంది.
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…