
ముఖ్యంగా రెండు కుటుంబాల విషయానికి వస్తే… ఇటీవల దగ్గుపాటి సురేష్ మరియు అల్లు అరవింద్ ల పుత్రరత్నాలు ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా వచ్చిన వార్తలను మీడియా వేదికగా ఖండించిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణలో వెలుగుచూసిన రెండు కుటుంబాల పేర్లు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే… ఈ నెల 24వ తేదీన విచారణను ఎదుర్కొననున్న నటుడు నవదీప్ పబ్ లో డ్రగ్స్ అమ్మకాలు జరిగేవన్న విషయం కూడా ఈ విచారణలో వెలుగుచూసినట్లుగా మీడియా ఛానల్స్ వేదికగా ప్రసారం అవుతున్నాయి.
అయితే ఇందులో అసలు నిజానిజాలు ఏమిటన్నది తెలియాలి అంటే… మొత్తం ఈ 12 మంది సెలబ్రిటీల విచారణ అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అధికారికంగా తెలియజేసే అవకాశముంది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు మీడియా మీట్ లు నిర్వహిస్తున్నారు గానీ, విచారణకు సంబంధించిన అప్ డేట్స్ ను మాత్రం మీడియా వర్గీయులకు వెల్లడించడం లేదు. మరో వైపు సెలబ్రిటీలు కూడా విచారణకు హాజరవుతున్నారు, తమపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నారు. అదే నిజమైతే… మరి విచారణలో కొత్త విషయాలు ఎలా వెలుగు చూస్తాయి?
Allari Naresh is ready to entertain audiences worldwide on September 4th with his upcoming socio-fantasy…
Romanchakam is getting a special kind of attention ahead of its release tomorrow, thanks to…