
ఆ దాడులలో దొరికింది కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం అని దానిలో ఉంది. అది కూడా తన కూతురి పెళ్లి సందర్భంగా ఉంచుకున్న రొక్కం, బంగారం అని ఆయన చెప్పుకున్నారని సమాచారం. ఆ పంచనామా పై దాడి చేసి అధికారి సంతకం ఉండటంతో 2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది.
దొరికిన సొమ్ము, బంగారం కూడా స్వాధీనం చేసుకోకుండా తిరిగి ఇచ్చేయడం కొసమెరుపు. అయితే మూడు రోజుల పాటు ఒక సెక్షన్ అఫ్ మీడియా వరుస కథనాలతో ముంచెత్తినా టీడీపీ చాలా ఆలస్యంగా వీటిని బయటపెట్టడం పార్టీ అభిమానులకు మింగుడుపడటం లేదు.
ఇప్పటికైనా సాక్షి మొదలైన మీడియా సంస్థలపై పరువునష్టం దావా వెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి పత్రిక ఈరోజు కూడా చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ ఒక వ్యాసం ప్రచురించడం విశేషం. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.
Mumbai Indians are officially out of IPL 2026, and the spotlight is once again firmly…
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…