
చెర్రీ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమా టాలీవుడ్ ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో రీమేక్ చేయాలన్న ఆలోచనలు అప్పట్లో వచ్చాయి గానీ, అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ సినిమా హక్కులు తీసుకోకుండా ‘ఫ్రీమేక్’ రూపంలో సుశాంత్ సింగ్, కృతిసనన్ జంటగా ‘రాబ్తా’ అనే సినిమా బాలీవుడ్ లో విడుదలకు సిద్ధం కానుండడంతో అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కక తప్పలేదు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ “మగధీర” రీమేక్ అన్న విషయం దాదాపుగా ఖరారు చేసింది. అయితే ‘మగధీర’ హక్కులను తీసుకోకుండా ఈ సినిమాను నిర్మించారంటూ ఆరోపిస్తూ… విడుదలను నిలిపివేయాల్సిందిగా అల్లు అరవింద్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును సంప్రదించారు. జూన్ 9న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకోగా, అరవింద్ వేసిన పిటిషన్ జూన్ 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దీంతో ఈ లోపున విషయం సెటిల్మెంట్ అవుతుందా? లేక “రాబ్తా” విడుదలకు బ్రేక్ పడుతుందా అనేది వేచిచూడాలి.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…