
అమరావతిలో స్థిరనివాసం ఉన్న ఒకే ఒక్క ప్రధాన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఎన్నికల వరకు జగన్ ఇక్కడి నుండే పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోనున్నారు. మరోవైపు తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అమరావతి రాజధానిగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. దీనిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు. మెరుగైన రాజధానిని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు.
దీనిబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధం అవుతుంది. దీని వల్ల వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజధాని ప్రాంతంలో పుంజుకుంటుందేమో చూడాలి. మొదట్లో రాజధాని ప్రాంతంలో తమకు పట్టున్న గ్రామాలలో భూసేకరణ అడ్డుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. ఆ తరువాత కోర్టు కేసులు, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులతో రాజధానిని ఆపడానికి ప్రయత్నించింది. అయితే ఎన్నికల సమయంలో ఆ ప్రాంత ప్రజల ఓట్లు కోసం తన స్టాండ్ మార్చుకుంది. అయితే ప్రజలు దీనిని ఎంత వరకూ నమ్ముతారో చూడాలి.
Sanjay Leela Bhansali recently confirmed the release date of Love & War, bringing relief to…
A student on an F-1 visa secured an internship with Amazon, but the opportunity soon…