
ఈ ప్లాన్ ప్రకారం అమరావతిలో కొత్తగా నిర్మితం కానున్న చట్ట సభ అసెంబ్లీ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు భవనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఏర్పాటు కానున్నాయి. ఇక రాజధానిలో కీలక భవనాలైన గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్, సీఎం అధికారిక నివాసాలు కృష్ణానదికి అభిముఖంగా కొలువు తీరనున్నాయి. మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మితం కానున్న అమరావతి కీలక భవనాల్లో రాజ్ భవన్, సీఎం నివాసం ఒకే బ్లాకులో ఏర్పాటు కానున్నాయి. వీటిలో కుడివైపున రాజ్ భవన్ ఉంటే, ఎడమ వైపున సీఎం అధికారిక నివాసం ఉండేలా డిజైన్ రూపొందింది. రాష్ట్ర పాలనలో రెండు కీలక కేంద్రాలుగా ఉండనున్న ఈ రెండు నిర్మాణాలు కృష్ణానది ఒడ్డున ఏర్పాటు కానున్నాయి. అలాగే ఈ రెండు నిర్మాణాల మధ్యన సువిశాల విస్తీర్ణంలో ‘పబ్లిక్ ప్లాజా’ పేరిట పెద్ద పార్కు ఏర్పాటు కానుంది.
నూతన సచివాలయం 60 అంతస్తుల్లో ఏర్పాటు కానుందని, చివరి అంతస్తులో అంతెత్తున సీఎం కార్యాలయం ఉంటుందని గతంలో వెలువడ్డ వార్తలకు భిన్నంగా, ఆర్భాటాలకు పోకుండా పర్యావరణ హితంగా రూపొందనున్న అమరావతిలో పరిపాలన కీలక కేంద్రం సచివాలయం (సెక్రటేరియట్) కేవలం 15 అంతస్తుల్లో మాత్రమే ఏర్పాటు కానుంది. మొత్తం అమరావతిలోని ప్రభుత్వ భవనాలన్నింటిలోకి 15 అంతస్తులతో ఏర్పాటు కానున్న సెక్రటేరియట్టే అత్యంత ఎత్తైన భవనంగా విరాజిల్లనుంది. ఈ భారీ భవంతిలో పైన 14వ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఏర్పాటు కానుండగా, టాప్ ఫ్లోర్ లో మాత్రం సీఎం కార్యాలయం కొలువు దీరనుంది. అమరావతిలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ భవనాలన్నీ 7 అంతస్తుల లోపే నిర్మితం కానున్నాయి.
Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…
KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…