
చూడబోతుంటే… జయలలితకు మళ్లీ కష్టకాలం వచ్చినట్లే కనిపిస్తోంది. నేడు ముగిసిన ఎన్నికల్లో జయలలితకు ఓటర్లు షాక్ ఇచ్చారని న్యూస్ నేషన్ తెలిపింది. కరుణానిధి వైపు ఓటర్లు మొగ్గుచూపారని, డీఎంకేకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. ‘న్యూస్ నేషన్’ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం… తమిళనాడులో అన్నా డీఎంకే 95 నుంచి 99 స్థానాలను గెలుచుకోబోతోందని తెలిపింది.
అయితే ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే 114 నుంచి 118 స్థానాల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోనుందని వెల్లడించింది. కెప్టెన్ విజయకాంత్ పార్టీ డీఎండీకే కేవలం 14 స్థానాలకే పరిమితం కానుందని ఈ సర్వే చెప్పగా, పీఎంకే ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. ఇతరులు 9 మంది గెలిచే అవకాశం ఉందని ‘న్యూస్ నేషన్’ వెల్లడించింది. ఈ ఒక్క సర్వేనే కాదు, విడుదలైన అన్ని సర్వేలు డీఎంకే పార్టీ వైపే మొగ్గు చూపాయి. దీంతో ఈ సర్వేల పట్ల ‘అమ్మ’ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…
రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి…