
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలి కానీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదని, హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. ప్రశ్నించాలి, అడగాలి కానీ మైకులు విరగ్గొట్టేలా ప్రవర్తించకూడదని అన్నారు. తన ప్రతి నిమిషం, ప్రతి గంట రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తానని, కలిసి వస్తే కలుపుకొని వెళతానని, కలిసి రాకపోయినా అభివృద్ధి పనుల విషయంలో వెనకడుగు వేయబోమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని అన్నారు. ఈ అసెంబ్లీ స్పెషాలిటీస్ ఇవే…
సచివాలయం ప్రాంగణంలోని రెండు ఎకరాల స్థలంలో అసెంబ్లీని నిర్మించారు.
ఒకే సముదాయంలోనే అసెంబ్లీ, సచివాలయాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 260 మంది కూర్చునేలా అసెంబ్లీని నిర్మించారు.
90 మంది కూర్చునేలా శాసనమండలిని నిర్మించారు.
అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను అత్యంత ఆకర్షణీయంగా ఏడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు.
స్పీకర్ ఛైర్ కు ఇరు వైపులా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
సభ్యుల వద్ద సెన్సర్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో, మైకులు విరగ్గొట్టడం కుదరదు.
ముఖ్యమంత్రికి, స్పీకర్ కు ప్రత్యేక సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు.
అసెంబ్లీలో ఐదు అత్యాధునిక గ్యాలరీలు… మీడియాకు 2, అధికారులు, వీఐపీలకు, విజిటర్స్ కు ఒక్కో గ్యాలరీ కేటాయించారు.
ఈ భవనాలను రికార్డు సమయంలో ఎల్ అండ్ టీ, సీఆర్డీఏలు నిర్మించాయి.
సచివాలయం ప్రాంగణంలో ఇప్పటికే పలు భవనాలు ఉండగా, ఆరో భవనంగా అసెంబ్లీ, శాసనమండలిని నిర్మించారు.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…