
దాదాపు 23 వేల బృందాలు ట్యాబ్ లతో సర్వేకు దిగితే, ఇప్పటివరకు కేవలం 716 కుటుంబాల సమాచార సేకరణ మాత్రమే పూర్తి కావడం గమనించదగ్గ విషయం. సిబ్బందికి ట్యాబ్ లపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, నెట్ వర్క్ సమస్యలు కూడా ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు తెలుపుతున్నారు. తదుపరి రెండు మూడు రోజుల్లో ఈ సమస్యలు సద్దుమణుగుతాయని భావిస్తున్నట్టు వివరించారు.
కాగా, సెలవు రోజైన ఆదివారం కూడా ఈ ‘ప్రజా సాధికారిక సర్వే’ కొనసాగించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం రోజు అందరూ ఇళ్ల వద్ద ఉంటారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో కుటుంబం సమాచార సేకరణకు దాదాపు ఒక గంట సమయం పడుతోందని, అలా ఒక బృందం రోజుకు 10 కుటుంబాల సర్వే కన్నా మించి చేయలేకపోతున్నారని అంటున్నారు.
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…
కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు…