
ఈ సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ లు వెనువెంటనే ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిన్నమనేని చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసిన ఇద్దరు మంత్రులూ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసారు. పిన్నమనేనికి మెరుగైన వైద్యం అందించాలని, త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. పిన్నమనేని సతీమణి మృతి పట్ల మంత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
యాక్సిడెంట్లకు నిలయంగా మారుతున్న ఔటర్ రింగ్ రోడ్ లో ప్రధానంగా రాజకీయ కుటుంబాలు, సినీ సెలబ్రిటీలకు చెందిన కుటుంబ సభ్యులే బలవుతుండడం గమనించదగ్గ విషయం. అయితే అన్ని ప్రమాదాలకు కారణం మాత్రం మితిమీరిన వేగమేనని తెలుస్తోంది. ఔటర్ పై అత్యంత వేగంతో ప్రయాణించే వాహనాలకు, మధ్యలో ఏ చిన్న అడ్డు వచ్చినా చివరికి అది పెను ప్రమాదంగా మారుతోంది. తాజాగా జరిగిన ఘటనలో కూడా పిన్నమనేని ప్రయాణిస్తున్న కారు దాదాపుగా 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మూడు పల్టీలు కొట్టగా, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన పిన్నమనేనికి ప్రాణాపాయం తప్పినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Is Bollywood's biggest battle shifting from the box office to social media? Recent reports suggest…
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…