
అయితే ఈ అరకొర నిధులు కూడా ఇవ్వడానికి కేంద్రానికి చేతులు రావడం లేదు. 4117.89 కోట్లలో కేంద్రం ఆల్రెడీ 2303 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది. ఆ మిగిలిన 1814.89 కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రం తాత్సారం చేస్తుంది. రాష్ట్ర అధికారులు కాళ్ళు అరిగేలా తిరిగాక 369 కోట్లు మంజూరు చేసింది కేంద్రం.
మిగతా 1445.89 కోట్లు ఎప్పుడు విదిలిస్తారో ఎవరికీ తెలియని మిస్టరీ. మరోవైపు విభజన అనంతరం రాష్ట్రం నానా అగచాట్లు పడుతూ కాలం వెళ్ళదీస్తుంది. ప్రతినెలా అప్పులతో బండి లాగుతూ జీతాలూ పెన్షన్లు ఇవ్వడానికి కూడా కష్ట పడుతుంది. అయినా ఢిల్లీ లో ఉన్నవారి మనసు కరగడం లేదని చెప్పాలి.
మరోవైపు రాజధాని, పోలవరం రూపం మరో రెండు అతిపెద్ద ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం సతమతం అవుతుంది. అయితే కేంద్రంతో పెట్టుకుంటే పరిస్థితిలు మరింత దిగజారతాయి అని తెలిసిన చంద్రబాబు తన పాలనా అనుభవంతో ఏదో రకంగా బండి నడిపిస్తున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు నోటీసు ఇచ్చినప్పుడు అందుకు…
Sunil Gavaskar has questioned the BCCI over the new Ranji Trophy schedule, with the former…