
ఈ విధానంపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, కేజ్రీవాల్ కు అవాక్కయ్యే ప్రశ్నను విసిరింది. నిబంధన బాగానే ఉన్నప్పటికీ, వినియోగదారుల అవసరాల రీత్యా ఒక్కొక్కరు రెండు కార్లను కొంటే, అసలుకే మోసం వచ్చినట్లవుతుందని ప్రశ్నించింది. నిర్దేశించుకున్న లక్ష్యం అటుంచితే, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని గ్రీన్ ట్రైబ్యునల్ అభిప్రాయ పడింది. దీనిపై సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తే బాగుంటుందని కేజ్రీవాల్ కు సూచించింది. గ్రీన్ ట్రైబ్యునల్ లేవనెత్తిన ప్రశ్న ఢిల్లీ వాసులకు ఓ కొత్త ‘ఐడియా’ను ఇచ్చినట్లయ్యిందని, మరి దీనికి కేజ్రీ ఎలాంటి సమాధానం చెప్తారోనని రాజధాని వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…