
కివీస్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ గుప్తిల్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులు చేసి సత్తా చాటాడు. మరో ఓపెనర్ మున్రో కూడా 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి 76 పరుగులు చేసి, ఓపెనింగ్ కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వీరిద్దరూ తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్లు అంతా విఫలం కావడంతో 250 పరుగులు దాటుతుందనుకున్న స్కోర్ 243 పరుగుల వద్దే ముగిసింది. అంత భారీ స్కోర్ సాధించడంతో కీలకమైన ఈ మ్యాచ్ లో కివీస్ విజయం సాధించి, ఫైనల్లో మరోసారి ఆసీస్ తో సమరం ఖాయం అనుకున్నారు.
తలచినదే జరిగితే క్రికెట్ లో మజా ఏముంటుంది… భారీ లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 24 బంతుల్లో 59 పరుగులు చేయగా, మరో ఓపెనర్ షార్ట్ 44 బంతుల్లో 76 పరుగులు చేసారు. పునాదులు బలంగా వేయడంతో మిగిలిన బ్యాట్స్ మెన్లంతా తలో చేయి వేసి ఆస్ట్రేలియాను గెలిపించారు. దీంతో ఆడిన నాలుగు టీ 20లలోనూ విజయం సాధించి, ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో నిలువగా, ఫైనల్ లో చోటు కోసం కివీస్ – ఇంగ్లాండ్ ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. నేడు జరిగిన మ్యాచ్ లో మొత్తం 38.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగా, ఏకంగా 488 పరుగులు నమోదయ్యాయి.
For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…
Prithviraj Sukumaran has revealed an interesting reason behind his decision to do Meghna Gulzar's crime…