
ఆ తరువాత ఆయనను కేంద్ర సహాయమంత్రి పదవి కూడా వరించింది. అయితే ఆయనను పూర్తి కాలం అవ్వకముందే తప్పించారు. అప్పట్లోనే ఆయనను తమిళనాడు గవర్నర్గా నియమించనున్నారనే ప్రచారం సాగింది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు గవర్నర్ పదవి వరించింది. 2019లో పోటీ చెయ్యలేదు. ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా ఉన్న కలరాజ్ మిశ్రాను రాజస్థాన్కు బదిలీ చేశారు. బండారు దత్తాత్రేయ అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో రైల్వే మంత్రిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.
నాలుగసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 89లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 96 నుంచి 98 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తొలిసారి 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. 1998, 99, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ నరసింహన్ను తప్పించి, ఆయన స్థానంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్ను కేంద్రం నియమించింది.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…