
మరోసారి కోహ్లి, డివిలియర్స్ లు విరుచుకుపడడంతో ఒకానొక సమయంలో 220 పరుగులకు చేరుతుందన్న అంచనాలు వేసారు. అయితే ఢిల్లీ బౌలర్స్ చివరి 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి, క్రీజులో పాతుకుపోయిన వాట్సన్, కోహ్లిల వికెట్లను నేలకూల్చడంతో స్కోర్ 191 పరుగులకే పరిమితం అయ్యింది. అయినప్పటికీ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ డీకాక్ 48 బంతుల్లో 108 పరుగులు, సెకండ్ డౌన్ బ్యాట్స్ మెన్ నాయర్ 42 బంతుల్లో 54 పరుగులు చేయడంతో, మ్యాచ్ 19.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, మ్యాచ్ ను సొంతం చేసుకుంది. మ్యాచ్ ఆద్యంతం ఫోర్లు, సిక్సర్లు మోత మోగడంతో మైదానంలో ప్రేక్షకులు, టీవీల ముందు వీక్షకుల పంట కూడా పండినట్లయ్యింది. అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించిన డీకాక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వశం కావడం ఒకటైతే, డీకాక్ అవుటైన సమయంలో ప్రత్యర్ధి జట్టు సభ్యులు కూడా చప్పట్లతో అభివాదాలు పలికారు.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…