
సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను నిండా ముంచేసి దాదాపు 150 కోట్లు కొల్లగొట్టిన భాను కిరణ్ మోసగించిన వైనాన్ని తెలుసుకుని తెలంగాణ పోలీసులే నోరెళ్ల బెట్టారట. వివరాల్లోకి వెళితే… సాధారణంగా వర్షాకాలంలో పడే పిడుగులు అత్యంత శక్తిమంతమైనవి. ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని భాను కిరణ్ జైల్లో ఉంటూనే 18 మంది సభ్యులతో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు.
బెంగళూరు కేంద్రంగా ‘కోహ్లీ గ్యాంగ్’ పేరిట రంగంలోకి దిగిన ఈ నయా ముఠా… ‘బిజినెస్ మెన్’ సినిమా తరహాలో ఓ కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా తెరిచింది. పిడుగు పాటు సమయంలో ఆకాశం నుంచి పడే శక్తిని ఒడిసిపడితే కోట్లాది రూపాయల ఖరీదు చేసే యురేనియం చేజిక్కినట్లేనని ఆ గ్యాంగ్ ప్రచారం ప్రారంభించింది. ఈ ముఠా మాయ మాటలకు తెలుగు, కన్నడ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు కూడా ఆకర్షితులయ్యారు.
పిడుగుల్లోని శక్తిని యురేనియంగా మార్చేందుకు ప్రయోగాలు చేయాలంటూ ఆ ముఠా పలికిన మాటలను సినీ, పారిశ్రామిక ప్రముఖులు గుడ్డిగా నమ్మేశారు. ప్రయోగాలకంటూ ఆ ముఠా అడిగిందే తడవుగా ముందూ వెనుకా చూడకుండా కోట్ల కొలదీ నిధులను అందజేశారు. అయితే ఆ తర్వాత ఆ ముఠా నుంచి మాట కూడా వినిపించకపోవడంతో తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠా కార్యకలాపాలపై సమగ్ర సమాచారం సేకరించారు. ఆ తర్వాత బెంగళూరులో కూడా రోజుల తరబడి నిఘా వేసిన పోలీసులు ఎట్టకేలకు ముఠా గుట్టును కనిపెట్టారు. వెనువెంటనే సదరు ముఠా ఏర్పాటు చేసుకున్న కార్పొరేట్ కార్యాలయంపై దాడి చేశారు. ముఠాలోని మొత్తం 18 మంది సభ్యులను అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా సదరు ముఠా సభ్యులు తమ నేత భాను కిరణ్ అని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. ఆ ముఠా చెప్పిన విషయాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలోనే భాను కిరణ్ ను కూడా ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మీడియా వర్గాలతో పాటు, సినీ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…