
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన 2017, జూన్ 2వ తేదీ నాడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి నోచుకోబోతోంది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ ఫేం రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు. ఈ లోపున చిత్ర తారాగణం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ సినిమాను కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 2018 ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాపై ప్రముఖ రచయితే సిరాశ్రీ ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసారు.
“కేసీఆర్ జీవితగాధను వెండితెర రూపం దాల్చాలనుకోవడం సరైన నిర్ణయమని, 4 కోట్ల మంది తెలంగాణా ప్రజలు ఈ సినిమాను ఒక్కసారి చూసినా 400 కోట్ల కలెక్షన్స్ వస్తాయని” ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. తెలంగాణా జాతిపిత కొనియాడుతున్న కేసీఆర్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు తెలుసుకోవాలన్న ఉత్సాహం సాధారణమే కావడంతో, తెలంగాణాలోని ప్రతి ఒక్కరు ఈ సినిమాను వీక్షిస్తారనేది సిరాశ్రీ లాజిక్. మరి సదరు రచయిత లెక్కలు వర్కౌట్ అయితే, ఆల్ టైం రికార్డులను సృష్టించడం ఖాయం కదా మరి!
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…