
గుజరాత్ లోని మహేష్ షా అనే వ్యక్తి 13,860 కోట్లు ప్రకటించగా, హైదరాబాద్ కు చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి 10 వేల కోట్లకు పైనే వెల్లడించారు. దీనికి గానూ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రుసుమును చెల్లించడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. అయితే అసలు విషయం తేలిందేమిటంటే… వీరు అసలు నల్లకుభేరులు కాదని, వీరి వెనుక ఉన్న “అసలు” నల్లకుభేరులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఐడీఎస్ క్రింద ప్రకటించిన ఈ ఇద్దరి 25 వేల కోట్లు ఎవరివి? ఏమయ్యాయి? అంటే…
ఇవన్నీ పెద్ద నోట్ల మార్పిడిలో భాగంగా ‘బ్లాక్’ కాస్త ‘వైట్’ అయిపోయిందేమో అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. అంటే అప్పటివరకు ఉన్న నల్లధనం కాస్త మోడీ నిర్ణయంతో తెల్లధనంగా మారిపోయిందా? దీంతో అసలు నల్లకుభేరులు సైడ్ కావడంతో, ఈ బినామీ బాబులు బుక్కయ్యరా? వంటి అనుమానాలతో ఐటీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాలతో ప్రధాని కంటే నల్లకుభేరులు అత్యంత తెలివిగా పావులు కదుపుతున్నట్లుగా అర్ధమవుతోంది.
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…