
అయితే మహేష్ సినీ ట్రాక్ రికార్డ్ ను పరిశీలిస్తే… రెండవ సారి దర్శకత్వం వహించిన దర్శకుల జాబితాలో ఒక్క పూరీ జగన్నాధ్ తప్ప మరే దర్శకుడు ప్రిన్స్ కు హిట్ ఇవ్వలేకపోయారు. ‘ఒక్కడు’ తర్వాత ‘అర్జున్’తో గుణశేఖర్ యావరేజ్ మార్క్ వరకే చేరుకోగా, ‘అతడు’ తర్వాత ‘ఖలేజా’ను బాక్సాఫీస్ బరిలో నిలపలేకపోయాడు. అలాగే ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల ‘ఆగడు’ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. అయితే ‘పోకిరి’ ప్రభంజనం తర్వాత ‘బిజినెస్ మెన్’తో హిట్ రేంజ్ ను ఇచ్చిన ఘనత ఒక్క పూరీకే దక్కింది.
మరి శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? పూరీ సరసన నిలుస్తాడా? లేక మరోవైపు చేరతారా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది కానీ, పూర్తి స్థాయి కుటుంబ కధా చిత్రంగా తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ కావడం ప్రధాన ప్లస్ పాయింట్. ‘పోకిరి’ సినిమా తర్వాత… అంటే పదేళ్ళ విరామం తర్వాత ప్రిన్స్ నటించిన ఓ సినిమా వేసవి సెలవుల సమయంలో విడుదల అవుతోంది. మహేష్ సినిమాలకు పట్టం కట్టే ఫ్యామిలీ ప్రేక్షకులే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు కొండంత అండ. ఏ విధంగా చూసినా బాక్సాఫీస్ బరిలో నిలవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్న ‘బ్రహ్మోత్సవం’ రియల్ రిజల్ట్ కోసం… చూస్తూనే ఉండండి..!
Is Bollywood's biggest battle shifting from the box office to social media? Recent reports suggest…
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…