
తాజాగా 320 రూపాయల చెక్కును కరణ్ చీమా అనే వ్యాపారవేత్త జోహార్స్ ప్రొడక్షన్ హౌస్ కు పంపించాడు. చెక్కుతో పాటు ఓ లేఖ కూడా పంపిన సదరు వ్యాపారవేత్త, ఎందుకు ఈ చెక్కు పంపానో అంటూ సవివరంగా తెలిపారు. కరణ్ జోహార్… మీరు విడుదల చేసిన వీడియోను చూసి చాలా బాధపడ్డా. సిగ్గుతో తల వంచుకునేలా ఉంది. మీరు, మీ సినిమాలో పని చేసిన వారు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండు టికెట్ల ఖరీదు అయిన ఈ 320 రూపాయల చెక్ పంపిస్తున్నా.
ఒక బిజినెస్ మ్యాన్ గా మరో బిజినెస్ మ్యాన్ బాధ ఏమిటో నాకు తెలుసు. పాకిస్థాన్ నటులు నటించిన మీ సినిమాను నేను చూడదలుచుకోలేదు. కానీ, మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ చెక్ పంపిస్తున్నా. పాక్ నటులను పెట్టుకుంటే పాకిస్థాన్ లో కూడా బిజినెస్ జరుగుతుంది. అందువల్ల లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనేది మీ ఉద్దేశం. కానీ, పాకిస్థాన్ వల్ల మన దేశంలోని వేలాది మంది నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు… అంటూ లేఖలో కరణ్ చీమా పేర్కొన్నారు.
మరోవైపు, తన సినిమాకు అడ్డంకులు కల్పించవద్దని… సినిమా విడుదల ఆగిపోతే తాను చాలా నష్టపోతానని… సినిమాకు పనిచేసిన వందలాది మందికి నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ కరణ్ జోహార్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందనగానే కరణ్ జోహార్ కు చీమా చెక్ పంపించి, కరణ్ జోహార్ తో పాటు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను అవాక్కు చేసారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…