
డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేని పక్షంలో సెటిల్మెంట్ క్రింద ముందుగా, మహిళలను లైంగికంగా లోబరుచుకుని, దానికి సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి మరలా మరలా లైంగిక దాడులకు పాల్పడడం, అలాగే సదరు మహిళలకు సంబంధించిన కుటుంబీకులు (చెల్లి, అక్క, కూతురు, ఇతర బంధువుల)ను కూడా తీసుకురావాలని వేధించడం వంటివి చేస్తున్నారని వెలుగు చూసాయి. విజయవాడలో ‘కాల్ మనీ’ మాటున ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని మహిళలు ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు.
ఇందులో ప్రధానంగా విజయవాడ టూటౌన్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ నీలం నీలాంబరావు, వెనిగళ్ళ శ్రీకాంత్ తదితరులు ఉన్నారని బాధితులు తమ గోడును వెళ్లగక్కుతున్నారు. కాల్ మనీ బాధితులు ఎక్కువగా టాస్క్ ఫోర్స్ ను సంప్రదిస్తున్నారని, అలాగే వాట్సప్ ద్వారా ఫిర్యాదులు అందజేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదని టాస్క్ ఫోర్స్ ఏసీపీ ప్రసాద్ చెప్పారు. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసారని తెలిపారు.
మహిళలను లైంగికంగా వేధిస్తుండగా, తోటి మగ వారి నుండి మాత్రం ఆస్తులను తమ పేర రిజిస్టర్ చేయించుకుంటున్నారని తేలింది. విజయవాడకు చెందిన సత్యంబాబు అనే వ్యక్తికి 11 లక్షల అప్పు ఇచ్చి, కోటి రూపాయల విలువైన సొంత ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఫిర్యాదుల జాబితా అంతకంతకూ పెరుగుతూపోతోంది.
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…