
దీనిపై సీఎం మాట్లాడుతూ జరిగిన అన్యాయంపై ఆదివారం జరిగే పార్లమెంటరి సమావేశంలో రాజకీయ నిర్ణయం తీసుకుందామని, అయితే, తొందరపడి ఎవరూ ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రులకు సూచించారు. జరిగిన అన్యాయంపై పోరాటం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంవైపు రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
టీడీపీ – బీజేపీ తెగతెంపులు తప్ప ఏది వారిని శాంతపరిచే సూచనలు కనపడటం లేదు. ఇప్పటికే కొందరు ఎంపీలు చంద్రబాబు ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం అని ప్రకటించి ముఖ్యమంత్రిపై మరింత ఒత్తిడి పెంచారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీడీపీ – బీజేపీ తెగతెంపులు చేసుకుంటే వైకాపా ఆ పార్టీ పక్కన చేరొచ్చు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ చేరకపోయినా బీజేపీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టొచ్చు. అది కూడా వైకాపాకు లాభమే. ఇప్పటివరకు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై జగన్ మోహన్ రెడ్డి స్పందించలేదు.
Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…