
ప్రస్తుతం, ప్రకాశం జిల్లా, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా టీడీపీలో చేరబోతున్నారు. గొట్టిపాటి చేరికను టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన కుమారుడు, అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ కరణం వెంకటేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మునుపటి వ్యూహాన్నే అనుసరిస్తూ కరణంను విజయవాడకు పిలిపించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు గల కారణాలను చంద్రబాబు వివరించారు.
“ప్రభుత్వాన్నే కూల్చేస్తామంటూ విపక్షం బరి తెగిస్తే… చూస్తూ ఊరుకోవాలా? విపక్షం ఆ స్థాయికి వెళ్లినప్పుడు మనం చూస్తూ ఊరుకోలేం కదా? అందుకే ‘ఆకర్ష్’కు తెరలేపాం… సీనియర్లుగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోవాల్సిందే” అంటూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ సిద్ధాంతాన్ని చంద్రబాబు బయటపెట్టడంతో కరణం మెత్తబడక తప్పలేదు. ఈ పరిణామంతో గొట్టిపాటి చేరికకు కూడా లైన్ క్లియర్ అయినట్లయ్యింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…