Telugu

ఏపీలో రాజధాని ఉద్యోగులకు బంపర్ ఆఫర్!

నవ్యాంధ్రప్రదేశ్ లో కొత్త పని విధానం దాదాపుగా అమల్లోకి వచ్చేసింది. వారానికి ఐదు రోజుల పాటు పనిచేసి మిగిలిన రెండు రోజులు సెలవుగా తీసుకునే వెసులుబాటును ఉద్యోగులకు కల్పించాలన్న ప్రతిపాదనకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బుధవారం నాడు జరిగిన సమీక్షల సందర్భంగా మంత్రి నారాయణ బృందం రూపొందించిన ఈ ప్రతిపాదనను ఏడాది పాటు అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త పని విధానం ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తూ… ప్రభుత్వం నిర్దేశించిన జూన్ లోగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలిపోయే ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది.

ADVERTISEMENT

హైదరాబాదులో కుటుంబాలు ఉన్నా, అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. అమరావతిలో వసతి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కుటుంబాలతో సహా ఉద్యోగులు హైదరాబాద్ ను వీడటం దాదాపుగా అసాధ్యమన్న బావనతోనే ఈ ప్రతిపాదన రూపుదాల్చింది. ఏడాదిలోగా అమరావతిలో వసతి సౌకర్యాలు మెరుగుపడతాయని, అప్పటిదాకా అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నారాయణ అధికారికంగా ప్రకటించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Nandamuri Mokshagna’s Debut Announced

Pics: Nandamuri Mokshagna’s Debut Announced

8 minutes ago

TFPC Election Results 2026: C Kalyan’s Mana Panel Scores Big Win

The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…

46 minutes ago