
అయితే ఈ అభిప్రాయంపై వాదనలు చేసుకోవడం కన్నా, సర్దుకుపోవడమే మంచిదన్న భావనతో ముందుకు వెళ్తున్న రాష్ట్ర సర్కార్, రెవిన్యూ లోటు విషయంలో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంపై మాత్రం తీవ్ర మనస్తాపానతో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2014-15 సంవత్సరానికి గానూ 24 వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా, కనీసం సగం కూడా ఇప్పటివరకు చెల్లించలేదు. అలాగే, 2015-16 సంవత్సరానికి సంబంధించి దాదాపు మరో 20 వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటిపై కనీసం నోరు మెదపకుండా, ఇటీవల కేవలం 900 కోట్లను మాత్రమే మంజూరు చేసింది.
ఓ పక్కన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారినా, నిధుల మంజూరు విషయంలో అలసత్వం చూపడంతో కేంద్రానికి ఓ ఘాటు లేఖ రాయాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలను గణాంకాలతో సహా సమగ్రంగా పొందుపరిచి భావిస్తున్న “లేఖ” అప్పుడే పొలిటికల్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ‘టిడిపి – బిజెపి’ మైత్రి విడిపోవాలని భావిస్తున్న ఏపీ ప్రతిపక్షం జగన్ దీనిని తనకు అనుకూలంగా మార్చుకుంటారేమో అన్న ఆలోచనలు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో కేంద్రంపై బాబు చేయాలన్న “దండయాత్ర” ఏ రూపు సంతరించుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Pics: Nandamuri Mokshagna’s Debut Announced
The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…