
‘కాల్ మనీ’ అంశాన్ని ఉదహరిస్తూ, 200 ఆడియో టేప్ క్యాసెట్లు ఉన్నాయని, ఈ కేసులో ఇవే అసలు సాక్ష్యలంటూ ‘సాక్షి’ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన విషయం తెలిసిందే. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేయడానికి సరైన సాక్ష్యాలు లేవంటూ అధికార పార్టీ వర్గీయులు ప్రసంగించడంతో జవాబిచ్చిన జగన్, 200 ఆడియో క్యాసెట్ల అంశాన్ని లేవనెత్తారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీల ఫోటోలపై కూడా కధనాలను చదివి వినిపించారు. ఈ పర్యవసానాలతో మీడియా బాధ్యతను ప్రస్తావిస్తూ… ‘’కాల్ మనీ’’ కేసులో సాక్ష్యాల కధనాలు ప్రసారం చేసిన అన్ని మీడియాలకు నోటీసులు అందిస్తామని ప్రకటించారు.
“నేలకు పోయేది…. నెత్తికి రాసుకోవడమంటే… ఇదే” అన్న చందంగా వైసీపీ అధినేత వ్యాఖ్యలు మారాయని, జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఉపయోగపడటం అటుంచితే, ఇపుడు తన మీడియా సంస్థను కూడా తానే ఇరుకున పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
కుప్పం మండలం నడిమూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డి ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసినట్లు…
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…