
నాయకుల, క్యాడర్ హడావిడికి దూరంగా చంద్రబాబు ఎక్కువగా బాధితులతో మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. బాధితులు చాలా మంది మాజీ ముఖ్యమంత్రి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ హయాంలో విపత్తుల సమయంలో ప్రభుత్వ యంత్రంగం సమర్ధవంతంగా పనిచేసి తమకు అండగా ఉండేదని, ఇప్పుడు ఆ భరోసా లేకుండా పోయిందని, తమను పట్టించుకునే వారే లేకుండా పోయారని వారు చంద్రబాబుకు చెప్పుకుని వాపోయారు.
తన పర్యటన అనంతరం చంద్రబాబు మీడియాతో సమావేశమయ్యే అవకాశముంది. అంతకుముందు హైదరాబాద్ నుంచి స్పైస్జెట్ విమానంలో గన్నవరం చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన విజయవాడ చేరుకున్నారు. గత కొద్ధి రోజులుగా చంద్రబాబు విపరీతమైన చెయ్యి నొప్పితో బాధ పడుతుంటే వైద్యులు ఆయనకు బెడ్ రెస్ట్ చెప్పడంతో ఆయన హైదరాబాద్ లోని కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…