
తగ్గించిన బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో టీడీపీ నాయకులు పిటీషన్ వేశారు. ప్రభుత్వం సుప్రీం కు వెళ్ళకపోవడంతో ఈ విషయంలో తామే ఎక్కువ చిత్తశుద్ధితో ఉన్నాం అని వారు నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు మురిగిపోతాయి.
ఇప్పటికే అనేక ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిధులు చాలా అవసరం. పలు సంక్షేమ పథకాల పంపిణీకి వీటి మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. సుప్రీంకు వెళ్తే నెలాఖరు లోగా ఈ కేసు తేలే అవకాశం ఉండదు. దానితో అందుకు జగన్ ప్రభుత్వం సుగమంగా లేదు.
టీడీపీ కోర్టుకు వెళ్లి ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకపోతే అది వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందే. దీనితో రెండు రకాలుగా అధికార పార్టీ ఇరుకున పడినట్టే కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఏకకాలంలో… అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈనెల 21న, పురపాలక సంఘాలకు ఈనెల 24న గ్రామ పంచాయతీలకు 27న వేర్వేరు తేదీల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…
South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…