
ఎపికి అన్యాయం చేసినవారే శిక్షింపబడాలని ఆయన సూచించారు. మన నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలని, అందుకే అరగంట సేపు నిరసనలో పాల్గొని.. అధికంగా మరో గంటసేపు పనిచేయాలని సూచించారు. అయితే చంద్రబాబు ఈ సూచన విపక్షాలకు రుచించలేదు. దీనితో యథాప్రకారం చంద్రబాబు దూషణకు దిగారు.
అయితే వివేకంతో ఆలోచిస్తే ఆయన మాటలలో నిజం అర్ధం అవుతుంది. ఇప్పటికే ఆర్ధిక బాధలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం ఈ బంద్ ల పేరుతో ఇటువంటి రభసను తట్టుకోగలదా? రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామని వస్తున్న వారికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ నిరసనలేవో వెళ్ళి ఢిల్లీలో చేస్తే కేంద్రప్రభుత్వంలో ఏదైనా కదలిక వస్తుందేమో!
Abhishek Sharma delivered a standout performance as SunRisers Hyderabad faced Delhi Capitals in IPL 2026…
A few days ago, Vijay's final film, Jana Nayagan directed by H Vinoth was leaked…