
ఛార్మి మహిళ గనుక మహిళా అధికారులతోనే విచారణ చేయాలని తెలిపిన కోర్టు, విచారణ స్థలాన్ని ఛార్మి తనకు అనుకూలంగా ఎంచుకోవచ్చని స్పష్టత ఇచ్చారు. అయితే తాను అబ్కారీ ఆఫీసుకే వస్తానని గతంలో స్పష్టం చేసిన ఛార్మి, తాజా పరిణామాలతో మనసు మార్చుకుంటే తప్ప, దాదాపుగా ఎక్సైజ్ ఆఫీసులో విచారణ జరగవచ్చు. తన లాయర్ సమక్షంలోనే విచారణ జరపాలని కోరిన ఛార్మి విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. కేవలం సాక్షిగా మాత్రమే మీ నుండి సమాచారం తీసుకోనున్నారు కాబట్టి న్యాయవాది అవసరం లేదని స్పష్టం చేసింది.
దీంతో ఒంటరిగానే ఛార్మి విచారణను ఎదుర్కోబోతోంది. దీనిపై స్పందించిన ఛార్మి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి… “కోర్టు స్పష్టం చేసింది గనుక ఛార్మి ఇక బ్లడ్ శాంపిల్స్ ఇవ్వదని” కుండబద్దలు కొట్టారు. అయితే నిజంగా తాను ఎలాంటి తప్పు చేయకపోతే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ఛార్మికున్న అభ్యంతరం దేనికి? అన్న ప్రశ్న సామాన్యులలో కలుగుతున్నాయి. పూరీ, తరుణ్ ల మాదిరి బ్లడ్ శాంపిల్స్ ఇస్తే తమలోని నిజాయితీ సగర్వంగా చాటిచెప్పుకోవచ్చు కదా! అయితే ఇవేమీ ఛార్మికి తెలియనివి కావు. ఇంతకీ ఛార్మి మదిలో ఏముందో..?!
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…