
ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల పోలీసులకు ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా చిరంజీవి అభిమానులు అమరావతి రైతులపై దూషణలకు దిగారు, చిరంజీవి జోలికి వస్తే ఊరుకునేది లేదు అని హూంకరించారు.
అయితే ఈ దూషణలు, బెదిరింపులు న్యాయమా అనేదివారే ఆలోచించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. “రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి. అప్పటినుండి ప్రభుత్వం తన అభిప్రాయం మార్చుకునేలా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. అటువంటి తరుణంలో ఎవరూ అడగకుండా చిరంజీవి ముందుకు వచ్చి మూడు రాజధానులకు మద్దతు ఇచ్చారు,” అని వారు అంటున్నారు.
“చిరంజీవి జోలికి రైతులు వెళ్ళలేదు. రైతుల జీవితాల్లోకే చిరంజీవి వచ్చారు. చిరంజీవి, జగన్ వంటి వారు ఎలా ఉన్నా… అభిమానులు రైతులు వంటి సామాన్యులే. వారు రైతుల బాధలను అర్ధం చేసుకుని వారి తరపున నిలబడాలి. అంతే గానీ రైతుల మీద దూషణలకు దిగడం ఎంతవరకూ సబబు?,” అని వారు ప్రశ్నిస్తున్నారు.
The Telugu film industry was left shocked after a tragic road accident in Hyderabad claimed…
Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…