చిరుకు ఆపరేషన్! ఫ్యాన్స్ కు చెప్పలేదు!

క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి, దానికి గల కారణాలు ఏమిటో వివరించి షాకిచ్చారు. ఇటీవల తిరుపతిలో ఏపీసీసీ చేపట్టిన ‘నీరు-మట్టి’ముగింపు కార్యక్రమానికి మరియు అలాగే అనంతపురం జిల్లా బండ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో చిరు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారానికి బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ వార్తలు అవాస్తమంటూ ప్రకటించిన చిరంజీవి, సదరు కార్యక్రమాల్లో పాలుపంచుకోలేకపోయిన కారణాలను వివరిస్తూ మంగళవారం నాడు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

“తన భుజానికి గాయమైందని, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ గాయానికి చికిత్స తీసుకుంటున్నానని, ఇటీవలే గాయానికి శస్త్ర చికిత్స (ఆపరేషన్) కూడా చేయించుకున్నానని” చిరు తెలపడంతో అభిమానులు షాకయ్యారు. ఈ చికిత్స ముగింపు దశకు వచ్చిందని, ఈ నెల 6న హైదరాబాద్ కు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఏ కారణంగా గాయమైందన్న విషయాన్ని మాత్రం చిరు ప్రస్తావించలేదు. మెగాస్టార్ కు ఏ చిన్న వార్త అయినా అభిమానులకు తెలుస్తుంటుంది. కానీ ఒక ఆపరేషన్ స్థాయికి వచ్చినా ఈ విషయం తెలియక పోవడం పట్ల అభిమానులలో చర్చ మొదలైంది.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

అంతిమ లబ్దిదారు జగనే.. అయితే ఏంటి?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు బయటపడింది. అప్పట్లో అది…

11 minutes ago

Jagan and YCP Missing Main Point On Laddu Problem?

The YSR Congress ecosystem is absolutely electrified since last night. They have been carrying this…

12 minutes ago