
ఈరోజు విజయవాడలోని హోటల్ స్వర్ణ పాలస్ లో నిర్వహిస్తున్న కరోనా సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి పదకొండు మంది చనిపోయారు. రాష్ట్రమంతా శోకసముద్రంలో మునిగిపోయిన సందర్భంలో చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ నుండి సరదా ట్వీట్ రావడం విమర్శలకు దారి తీసింది. “చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు … 4PM Today,” అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఇదేదో మొదటి సారి చేసింది కాదు. మే ఏడవ తారీఖున విశాఖపట్నంలోని ఎల్జీ పొలిమెర్స్ కంపెనీలో విస్ఫోటనం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు భయంతో తమ బిక్కుబిక్కు మంటూ ఉన్న సమయంలో చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ నుండి జగదేక వీరుడు అతిలోక సుందరి మెమోరీస్ అంటూ చిరంజీవి మాట్లాడుతున్న వీడియో విడుదల చేశారు.
ఆ తరువాత విమర్శలు వచ్చాకా ఆ గ్యాస్ లీక్ ఉందంతంపై చిరంజీవి స్పందించారు. ఈరోజు ట్వీట్ కి కూడా నష్టనివారణ చేపట్టాల్సిన పరిస్థితి. చిరంజీవి ట్విట్టర్ హేండిల్ ఎవరు మైంటైన్ చేస్తున్నారో గానీ వారు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…