
కానీ, ఏడు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం భూమన కరుణాకరరెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయం నుండి బయటకు రావడంతో వైసీపీ వర్గాలు అవాక్కైనట్లయ్యింది. భూమనను అరెస్ట్ చేస్తారేమో, ప్రభుత్వంపై విరుచుకు పడదామని భావించిన వైసీపీ వర్గాలకు షాక్ తగలగా, బయటకు వచ్చిన భూమన మాత్రం తనదైన స్టైల్ లో ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. “తనను తుని కేసులో ఇరికించడానికి చంద్రబాబు సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని, సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని” అన్నారు.
భూమన వ్యాఖ్యలను పరిశీలిస్తే… మళ్ళీ సీఐడీ విచారణ తప్పకపోవచ్చన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా మరిన్ని ఆధారాలు లభ్యమైన తర్వాత వైసీపీ వర్గాలు ఆశించిన కార్యం జరగొచ్చని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్లు… ఈ కేసులో వైసీపీ నేతలను ఏపీ సర్కార్ ఇరికించాలంటే, ఇన్ని సార్లు విచారణ చేయాలంటారా? అధికారం చేతిలో ఉంటే ఏం చేయవచ్చో, ఎంత చేయవచ్చో అనేది వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ చేసి చూపించిన విషయం బహిరంగమే.
మరి అదే విధానాలను చంద్రబాబు కూడా అవలంభిస్తే… వైసీపీ నేతలకు ఈ విచారణ కూడా అనవసరమేమో? అన్న ప్రశ్నలు తలెత్తకమానవు. చేతిలో ఉన్న మీడియాతో ప్రజలలో భావోద్వేగాలను రగిల్చి, తద్వారా రాజకీయ లబ్ది పొందాలనే లక్ష్యం తప్ప, వైసీపీ వర్గాలకు మరొకటి తెలియవన్నది ఈ సందర్భంగా మరోసారి రుజువు చేసారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…