
గడచిన 14 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 6.2 రోజులు పట్టేదని, గడచిన వారంలో దీనికి 7.2 రోజుల సమయం పట్టిందన్నారు. గడచిన మూడు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 9.7 రోజులు పడుతోందని చెప్పారు. ఇప్పటివరకు కట్టుదిట్టంగా అమలు చేసిన లొక్డౌన్ కారణంగానే ఇది సాధ్యమైంది.
అయితే ఈ తరుణంలో దేశంలోని చాలా ప్రాంతాలలో రేపటి నుండి లొక్డౌన్ ని పాక్షికంగా సడలిస్తున్నారు. ఇది ఎటువంటి పరిణామానికి దారి తీస్తుందో అని అంతా చింతిస్తున్నారు. మే 3 వరకు ఇప్పుడు ఉన్నట్టే కఠినంగా లొక్డౌన్ అమలు చేస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వచ్చేవని నిపుణుల భావన.
కాకపోతే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇవ్వక తప్పలేదు. గ్రామీణ ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు, వస్తు రవాణాకు ఊతమిచ్చేలా కేంద్రం పలు మినహాయింపులు ఇచ్చింది. ఇవన్నీ ఈనెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. అయితే నాన్ – హాట్ స్పాట్ ప్రాంతాలలో మాత్రమే ఇవి అమలు అవుతాయి.
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…
One interesting pattern in Anil Ravipudi’s career is becoming hard to ignore. He rarely sticks…