
“నవ్యాంధ్ర రాజధానిలో తనకు భూములు ఉన్నాయని జగన్ నిరూపిస్తే కనుక తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని” ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబుప్రకటించారు. “తమ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుండటంతో నైరాశ్యంలో ఉన్న జగన్, ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నారని, గత పదేళ్ల నుంచి తన భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, తాము అక్రమ లావాదేవాలు చేయలేదని, తమకు బినామీ ఆస్తులు లేవని, అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే వార్త రాసిన వారికే వాటిని ఇచ్చేస్తానని” రావెల ఓపెన్ ఆఫర్ ప్రకటించారు.
ఇదే బాటలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. రోజా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన బోండా, “ఐరన్ లెగ్ గా పరిణమించిన రోజా విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, వైసీపీ డిమాండ్ చేసినట్లుగా ప్రతి అంశంపై విచారణలు వేసుకుంటూ పోతే, రోజుకో విచారణ కమిటీని వేయాల్సి వస్తుందని, అయినా రాజధాని భూదందాపై వైసీపీ వద్ద ఏమైనా ఆధారాలుంటే వాటిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తామని” బోండా ప్రకటించారు. ఇలా ఏ తెలుగుదేశం రాజకీయ నాయకుడిని కదిలించినా… ‘సాక్షి’ కధనాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…