
“ఇప్పటికే కేసు ఒకటే అయినా, వివిధ వ్యక్తులు, సంస్థల పేర్లు చెప్పి సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసిందని, తాజాగా ఈడీ కూడా విడతలవారీగా చార్జిషీట్లు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని” జగన్ తరపు న్యాయవాది వాదనతో సీబీఐ కోర్టు ఏకీభవించింది. జగన్ తరపు న్యాయవాది వాదలనతో సీబీఐ కోర్టు అంగీకరించడంతో సంతోషంగా ఉన్న వైసీపీ వర్గీయులకు తాజాగా హల్చల్ చేస్తున్న వార్త ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఓ పక్కన జగన్ చేసిన ఢిల్లీ పర్యటన సానుకూల ఫలితాలను ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా, మరో పక్కన జగన్ అరెస్ట్ కోసం సీబీఐ, ఈడీల మధ్య పోటీ జరుగుతోందన్న ప్రచారానికి సోషల్ మీడియాతో పాటు నెటిజన్లు తెరలేపారు. మార్చి 28వ తేదీన ‘ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్’ ఎదుట హాజరు కావాల్సి ఉండడంతో అర్జెంట్ గా జగన్ ఢిల్లీ పర్యటన గావించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని వైసీపీ వర్గాలు సానుకూలంగా తీసుకుంటుంటే… ప్రత్యర్ధి వర్గాలు మాత్రం సీబీఐనే జగన్ ను అరెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోందని, అందుకే ఈడీకి అనుమతి ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…