
అయితే ఎట్టకేలకు మోడీ నిర్ణయానికి మద్దతు పలికిన ఓ వ్యక్తి వెలుగులోకి వచ్చారు. అతనేమీ సామాన్యుడు కాదు, గతంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా విధులు నిర్వహించిన వ్యక్తి దువ్వూరి సుబ్బారావు. 1991 ఆర్ధిక సంస్కరణల తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఒకటిగా అభివర్ణించిన దువ్వూరి, నల్లధనాన్ని వెలికి తీయడంలో ఇది చాలా తెలివైన చర్యగా అభిప్రాయపడ్డారు. బ్లాక్ మనీని ఎంతో నేర్పుగా నాశనం చేయడమేనని మోడీ నిర్ణయానికి పూర్తి మద్దతు పలికారు.
పెద్ద నోట్ల రద్దుపై ఇంకెవరైనా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే బహుశా ఇంతటి ప్రాధాన్యత దక్కి ఉండేదేమో గానీ, దువ్వూరి సుబ్బారావు లాంటి వ్యక్తి సమర్ధించడం పరిశీలించదగ్గ విషయమే. అయితే ఈ నిర్ణయం ఫలాలు ప్రస్తుతం సామాన్యుడికి కనిపించే విధంగా ఉండకపోవడంతో, ఇందులో దేశానికి చేకూరే ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ప్రజలను ప్రభావితం చేసే మీడియా వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని సరైన దిశగా ప్రజల్లోకి తీసుకెళ్లలేదనే చెప్పాలి.
The debate over OTT versus theatres has picked up again, and this time senior actor…
Following the terrible failures of Indian 2 and Thug Life, Kamal Haasan has still not…