
నయీం బెదిరింపులకు భయపడిన సదరు నిర్మాత ఏకంగా 8.5 కోట్ల రూపాయలు ముట్టచెప్పినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అలాగే కింది స్థాయి నుంచి వచ్చిన పలువురు నిర్మాతలను నయీం బెదిరించినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఓ సినిమా తీయాలని భావించిన నయీం, ఈ దిశగా పలువురు టాలీవుడ్ దర్శకులతో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం.
ఇటీవలే నానక్ రామ్ గూడలో ఒక బిజినెస్ మ్యాన్ తో పలు డీల్స్ లో భాగం పంచుకున్నట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఈ ఆర్ధిక విషయాలపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివిధ బ్యాంకులలో దాదాపు 250 ఎకౌంటు ఖాతాలు ఉన్నట్లుగా పోలీస్ వర్గాలు వెల్లడించారు. తాజాగా జరుగుతున్న విచారణలో ఇంకెన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…