
గంటా కండువా కప్పుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ అనధికార ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నారు. ఈ చేరిక వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డికి, స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఇష్టం లేదని సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల గంటాపై ట్విటర్లో ఆరోపణలు గుప్పించారు.
చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని.. దానికి మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు గంటా పునీతం కాబోతున్నారు. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన గంటా.. ఆతర్వాత ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో… మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి మరోసారి మంత్రి కూడా అయ్యారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. కొంతకాలంగా ఆ పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…