
విశాఖ అన్ని విదాలుగా అర్హమైన నగరమని , జిఎన్ రావు కమిటీ నివేదికను సమర్దిస్తున్నానని ఆయన అన్నారు.విశాఖ వాసిగా, ఇక్కడే అనేక పదవులు చేసిన వ్యక్తిగా తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తానని ఆయన చెప్పారు. పార్టీ అమరావతిపై ఒక నిర్ణయం తీసుకున్నా, తాను మాత్రం విశాఖను స్వాగతిస్తానని ఆయన చెప్పడం గమనార్హం.
ఎన్నికల నాటి నుండీ గంటా తెలుగుదేశం పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ మారుతున్నట్టు అనేక వదంతులు వినిపిస్తున్నాయి. అయితే ఒకటి రెండు సందర్భాలలో ఆయన పార్టీ మారడం లేదని చెప్పినా, ఆయన వ్యహారశైలి అనుమానంగానే ఉంది.
శాసనసభా సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. ఇప్పుడు ఈ రాజధాని వంక చూపించి ఆయన పార్టీ మారిపోతారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. గంటా వెళ్లడం అంటూ జరిగితే ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోతారని వదంతులు వినిపిస్తున్నాయి.
Chandrababu Naidu is changing how Andhra Pradesh works. He is focusing on saving government money…
In under three weeks from now, Ram Charan will be returning to the big screen…