
ప్రస్తుతం చక్రి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు గోపీచంద్. కెరీర్ లో 25వ సినిమాగా కూడా ప్రాధాన్యతను దక్కించుకున్న ఈ సినిమా టైటిల్ ను “పంతం”గా పరిశీలించారు. అయితే ఈ టైటిల్ మరీ డబ్బింగ్ సినిమా టైటిల్ మాదిరి ఉందన్న నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో, మార్పు అనివార్యం అయ్యిందని తెలుస్తోంది. కానీ గోపీచంద్ సెంటిమెంట్ ను పక్కన పెట్టకుండా, చివర్లో ‘౦’ వచ్చే విధంగానే ‘శపథం’ అన్న టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అయినా గోపీచంద్ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిద్దాం.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…