
ఏదో టిడిపి ఆడించిన మైండ్ గేమ్ అని కొందరు వైసీపీ నేతలు చాలా తేలికగా తీసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఆటలన్నీ సహజం కాబట్టి వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే వైసీపీ నేతలు ఇక్కడితో ఆగిపోతే, తమ ప్రభావం ఉండదనుకున్నారో ఏమో గానీ, గుంటూరు జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, ముస్తఫా, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు మీడియాలో మాట్లాడుతూ… ఒక అద్భుతమైన హాస్యాస్పద ప్రకటన చేసారు. ఈ ప్రకటన విన్న తర్వాత ‘ఆశ్చర్యంతో కూడిన హాస్యం’ రావడం సహజమే మరి!
“తెలుగుదేశం పార్టీ నేతలు మాతో టచ్ లో ఉన్నారని, ఏ క్షణమైనా వారంతా వైసీపీలోకి రావచ్చని, తెలుగుదేశం మునిగిపోయే నావ అని, ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపారని” తెలుగుదేశం పార్టీకి కౌంటర్ ఇచ్చే పనిలో “జోకులు” వేసారని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు అయినా చేసుకోవచ్చు గానీ, అధికారం చేతిలో ఉంచుకుని రాజకీయ నేతలు ప్రతిపక్షంలోకి వెళ్ళాలని చెప్పడం హాస్యాస్పదం కాక ఇంకేంటి..? అంటున్నారు. నిజానికి అలాంటి అరుదైన సంఘటనలు ఏ నూటికో, కోటికో జరుగుతుంటాయి. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితులలో అయితే జరిగే అవకాశం లేదని అందరికీ తెలిసిందే.
టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని ప్రస్తావించిన వైసీపీ నేతలు, దాన్ని పునరావృతం చేయాలని పడే తాపత్రయంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ‘మైండ్’ గేమ్ ఆడుతున్నట్టే ఉన్నాయా? లేక ఇలాంటి వారు పార్టీలో ఉంటే ప్రత్యర్ధులు ‘మైండ్’ గేమ్ ఆడుతూనే ఉంటారని భావించాలా? ఇప్పటికీ విజ్ఞులకు అర్ధమై ఉంటుంది..!
A decades-old Foreign Exchange case has ended with a significant ruling for NRIs and banking…
బీజేపీ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలలో పాతాళానికి పడిపోతున్నాయి. అయితే అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా…