
మరి దీనికి రామ్ ఏ విధంగా స్పందిస్తారో గానీ, డైరెక్ట్ గా హీరోను టార్గెట్ చేస్తూ సదరు మీడియా ఛానల్ ప్రసారం చేసిన కధనంపై సినీ వర్గీయులు మండిపడుతున్నారు. ఓ పక్కన “నేను.. శైలజ…” సినిమా మంచి వసూళ్లు రాబడుతూ తెలుగు సినీ పరిశ్రమకు కొత్త సంవత్సరంలో మంచి శుభారంభాన్ని ఇవ్వడమే కాకుండా, రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలబడుతున్న తరుణంలో… దీనికి పూర్తి వ్యతిరేకంగా సదరు మీడియా ఛానల్ చేసిన ప్రసారాలు… ఆ మీడియా సంస్థకున్న ప్రాధాన్యతను తగ్గిస్తోందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
బహుశా రామ్ నటించిన “శివమ్” వంటి సినిమాకు ఇలాంటి కధనాలే ప్రసారం చేస్తే అందరూ సమర్థించే వారని, ఉన్న సత్యానికి దూరంగా ప్రసారాలు చేయడం… కేవలం ఉద్దేశపూర్వకమైన చర్యగానే మిగిలిపోతుందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ట్విట్టర్ వేదికగా రామ్ వ్యక్తపరిచిన భావాలలో విమర్శలకు తావిచ్చేది ఏది లేదని, కేవలం తన మనసులోని ఆవేదనను చెప్తూ, మీడియా నైతికతను పాటించాల్సిందిగా సూచించారని ‘ఎనర్జిటిక్ స్టార్’ అభిమానులు అంటున్నారు.
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…
Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…