
ఈ సమయంలో కోర్టు విచారణ చెయ్యదగింది కాదని ఆయన చెప్పడంతో కోర్టు కూడా అంగీకరించింది. రైతులకు తమ సమస్యలు తెలియజేయడానికి హైకోర్టు సమయమిచ్చినా… అంతలోపే సభలో ప్రభుత్వం బిల్లు ఎందుకు పెట్టిందని ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లు చట్టంగా మారడానికి.. కనీసం నెలరోజుల సమయం ఉండటంతో వచ్చేనెల 24కు వాయిదా పడింది.
కోర్టులు విచారణ మొదలు పెట్టకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం విశాఖపట్నానికి తరలిస్తుందని రైతుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. బిల్లు చట్టంగా మారకుండా, కోర్టులో విచారణ పూర్తి కాకుండా ఏవైనా విభాగాలను ప్రభుత్వం తరలిస్తే.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోర్టు చెప్పింది.
అలాగే దాని ఖర్చును వ్యక్తిగత ఖాతాల నుంచి జమ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిన్న మండలిలో పరిణామాల దగ్గర నుండి నేటి హైకోర్టు తీర్పు వరకూ వరసగా ఎదురుదెబ్బలు తగలడం ప్రభుత్వం పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు.
The Telugu film industry was left shocked after a tragic road accident in Hyderabad claimed…
Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…