
ఇంతకీ ఆ రెండు చిత్రాలు ఏమిటంటే… దాదాపు 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శర్వానంద్ “ఎక్స్ ప్రెస్ రాజా” మరియు దాదాపు 25 కోట్లతో నిర్మితమైన అక్కినేని నాగార్జున “సోగ్గాడే చిన్నినాయనా” చిత్రాలు. ఈ రెండు సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా సంక్రాంతి సందడి రీత్యా ఆయా సినిమాల బడ్జెట్ ఖచ్చితంగా రికవరీ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక, మిగిలిన రెండు చిత్రాలకు మాత్రం పాజిటివ్ టాక్ వస్తేనే, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గట్టేక్కే పరిస్థితి నెలకుందని చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ “డిక్టేటర్” దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో”కు 50 కోట్ల వరకు ఖర్చయ్యిందని ఫిలింనగర్ వర్గాల టాక్. మరి ఈ స్థాయిలో భారీ వసూళ్ళు సాధించాలంటే… ఈ రెండు సినిమాలకు ‘సూపర్ హిట్’ టాక్ రావాల్సిందే. లేదంటే డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు పట్టపగలే చుక్కలు కనపడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ కారణం చేతనే ఈ సంక్రాంతి “బాబాయ్ – అబ్బాయ్” ఫైట్ లా మారిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…
Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…