
ఇటీవల కాలంలో కాంట్రాక్టుల్లో వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కలు సరిగా చూపలేదన్న సమాచారంతో ఐటీ శాఖ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. సోదాలకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఐటీ శాఖ అధికారులు నిరాకరించారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. దీనిపై మేఘ సంస్థ కూడా స్పందించింది.
సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయని పేర్కొంది. రెండేళ్లకోసారి ఐటీ శాఖ అధికారులు ఇలా తనిఖీలు నిర్వహించడం గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని తెలిపింది. మీడియాకు పంపిన మెస్సేజ్ లో వీటిని రొటీన్ తనిఖీలుగానే చూడాలనే ఎటువంటి కవరేజ్ ఇవ్వకూడదని రిక్వెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు దీని మీద వివాదాలు చెలరేగుతున్నాయి.
మేఘ కంపెనీ ఇటీవలే టీవీ9లో షేర్ కొన్న విషయం తెలిసిందే. తమ దాకా వస్తే గానీ తెలియరాలేదని, వేరే వారి మీద రొటీన్ గా సోదాలు జరిగినా ప్రతీ పదినిముషాలు ఒకసారి టీవీలో చెప్పే టీవీ9 యజమాని ఇప్పుడు తమ విషయంలో మాత్రం సమన్వయంతో వ్యవహరించాలని మిగతా మీడియాని రిక్వెస్ట్ చెయ్యడాన్ని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే పార్టీ గెలుపును ఆ పార్టీ అభిమానులు జరుపుకున్న దానికంటే కాస్త అధికంగానే…