
తొలి సెట్ హోరాహోరీగా జరగడంతో 19-21 వద్ద ముగిసింది. రెండో సెట్ లో కూడా 10 పాయింట్లు ముగిసే సమయానికి ఇరువురు సమఉజ్జీలుగా నిలవడంతో ఉత్కంఠభరితంగా ముగుస్తుందన్న అంచనాకు వచ్చేసారు. ఇక్కడే సింధు తన ప్రతాపం చూపింది. బలమైన షాట్లతో ప్రత్యర్ధి ఒకుహరాపై విరుచుకుపడడంతో కోలుకోలేని పరిస్థితికి వచ్చేసింది. దీంతో ఒకుహరా 10 పాయింట్ల వద్ద ఉండగానే, సింధు 21 పాయింట్లు సాధించి మ్యాచ్ ను ముగించింది.
ఓ పక్కన సింధు కొడుతున్న షాట్లకు అభిమానులు ‘ఇండియా… ఇండియా…’ అంటూ నినాదాలు చేసి మరింత ఉత్సాహాన్ని నింపారు. ఇదే ఫాంను ప్రదర్శిస్తే… ఫైనల్లో జయకేతనం ఎగురవేసి భారత్ కు స్వర్ణం అందించడం అంత కష్టసాధ్యమైన విషయమేమీ కాదన్నది మ్యాచ్ ను తిలకించిన వారెవరైనా చెప్పే విషయమే. ఈ విజయంతో సింధు ఇంట విజయోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ మాటకొస్తే… ఒక్క సింధు ఇంట ఏముంది… దేశవ్యాప్తంగా ప్రస్తుతం మన హైదరాబాదీ క్రీడాకారిణి సింధు పేరే మారుమ్రోగుతోంది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…