
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధావన్ 25 బంతుల్లో 51 పరుగులు చేసి భారీ స్కోర్ కు బాటలు వేసాడు. రోహిత్ శర్మ 43, రేహనే 25, రైనా 30, పాండ్యే 27 పరుగులతో సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో పెరేరా వేసిన 19వ ఓవర్ లో చివరి మూడు బంతుల్లో పాండ్యే, రైనా, యువరాజ్ లు మూడు ఫుల్ టాస్ బాల్స్ అవుటై, పెరేరాకు హ్యాట్రిక్ సమర్పించారు.
భారీ లక్ష్య చేధనలో తొలి బంతి నుండే ఆరంభమైన శ్రీలంక కష్టాలు మ్యాచ్ టీమిండియా వశం చేసాయి. ఏ దశలోనూ లంకేయులు మ్యాచ్ లో పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లను కోల్పోయింది. అశ్విన్ 3, నెహ్రా 2, జడేజా 2, బూమ్రా 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి మ్యాచ్ లో ఓడిన టీమిండియాకు ఈ విజయం నూతన ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని అందించింది.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…