
ఇటీవల కాలంలో బౌలింగ్ తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ ఆడుతోన్న పాండ్య 95 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ తో 93 పరుగులు చేసి టీమిండియా పరువు నిలిపాడు. భువనేశ్వర్ కుమార్ (25)తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పాండ్య, సెంచరీకి చేరువైన క్షణంలో వెనుతిరిగాడు. అద్భుతమైన షాట్లతో అలరించిన పాండ్య ఇన్నింగ్స్ కు వీక్షకులు ముగ్ధులయ్యారు. దీంతో టీమిండియా గౌరవప్రదమైన 209 స్కోర్ చేయగలిగింది.
తొలి ఇన్నింగ్స్ లో 77 పరుగుల ఆధిక్యంలో ఉన్న సఫారీలను రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా కట్టడి చేయలేని పక్షంలో తొలి టెస్ట్ లో భంగపాటుకు గురయ్యే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటివరకు సొంత గడ్డలపై టన్నుల కొద్ది సెంచరీలు బాదుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అండ్ కోలకు సఫారీ పిచ్ లపై పరుగులు చేయడం ఛాలెంజింగ్ గా మారింది. మరోవైపు సొంత గడ్డపై నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా భరతం పడతాం అంటున్నారు సఫారీలు.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…